
కోతుల నుంచి వచ్చిన మంకీ పాక్స్ వేగంగా విస్తరిస్తోంది. ఆరోగ్య నివేదికల ప్రకారం.. ఈ వ్యాధి సోకిందంటే శరీరంపై దద్దుర్లు ఏర్పడుతాయి. ఇది మొదట నోటిపై కనిపిస్తుంది. అమెరికా, యూరప్లలో ఈ వ్యాధి విజృంభించడంతో అక్కడి శాస్త్రవేత్తలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇండియాలో ఇప్పటివరకు ఎటువంటి కేసు నమోదు కాలేదు. అయితే అనేక దేశాలలో చాలా కేసులు నమోదవుతున్నాయి.
మంకీపాక్స్ అమెరికాతో పాటు బ్రిటన్, ఇటలీ, స్వీడన్, పోర్చుగల్, స్పెయిన్లకు విస్తరించింది. ఇది యునైటెడ్ కింగ్డమ్ లో పుట్టిందని ఊహిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా ఈ వ్యాధిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. 1958 లో ఈ వ్యాధి మొదట కోతులలో కనిపించింది. అప్పటి నుంచి దీనిని మంకీ-పాక్స్ అని పిలుస్తున్నారు. కానీ మానవులలో మొదటి కేసు 1970లో కనబడింది.
ఈ వ్యాధి సోకినప్పుడు అధిక జ్వరం, తలనొప్పి, వాంతులు వంటి లక్షణాలు ఉంటాయి. మొదట జ్వరం లక్షణాలు కనిపిస్తాయి. ఆ తర్వాత శరీరంపై దద్దుర్లు ఏర్పడుతాయని పలు పరిశోధనల్లో వెల్లడైంది. ఈ లక్షణాలు 7 నుంచి 14 రోజులు ఉంటాయి. జ్వరం వచ్చిన తర్వాత 1 నుంచి 3 రోజులలో రోగికి దద్దుర్ల సమస్య మొదలవుతుంది. అవి మొదట నోటిపై ఏర్పడుతాయి. క్రమంగా ఈ దద్దుర్లు శరీరం మొత్తం వ్యాపిస్తాయి. ఇవి చాలా నొప్పిగా ఉంటాయి.
మంకీపాక్స్ని గుర్తించడానికి అనేక పరీక్షలు చేస్తున్నారు. వాటిలో ఒకటి పాలిమరేస్ చైన్ రియాక్షన్ (PCR). దీనిని ఒక రకమైన DNA పరీక్ష అంటారు.